మండలంలోని నీలా పేపర్ మిల్ గ్రామ శివారులో కబ్జాకు గురైన నిజాంసాగర్ కెనాల్ స్తలాన్ని ఇరిగేషన్ డిఈ బలరాం పరిశీలించారు. నిజాంసాగర్ కెనాల్ కబ్జాకు గురి కావడంతో కందకుర్తి ఎత్తిపోతల ద్వారా తమ పొలాలకు నీరు అందడం లేదని నీలా పేపర్ మిల్ గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్ ని ఇటీవలే కలిసి విన్నవించారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే సూచన మేరకు కబ్జాకు గురైన వ్యవసాయ స్తలాన్ని పరిశీలించినట్లు డిఈ బలరాం తెలిపారు.