గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

74பார்த்தது
నిర్మల్ జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం స్థానిక కురాన్నపేట్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేయగా తోకల రాజేశ్వర్, షేక్ అమీర్ సోహెల్ అనే ఇద్దరూ వ్యక్తులు గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఇందులో టౌన్ సీఐ అనిల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி