వ్యవసాయ బావిలో మొసలి పట్టివేత

56பார்த்தது
నిర్మల్ జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్ చెరువు సమీపంలో గల వ్యవసాయ బావిలో అటవీశాఖ అధికారులు మొసలిని పట్టుకున్నారు. గత వారం రోజులు క్రితం బావిలో మొసలిని గమనించిన రైతు భయాందోళనకు గురై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు మంగళవారం వ్యవసాయ బావిలో నుంచి చాకచక్యంగా మొసలిని పట్టుకొని శ్రీరామ్ సాగర్ జలాశయంలో వదిలిపెట్టారు. ఇందులో స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్, అటవీ శాఖ అధికారులున్నారు.

தொடர்புடைய செய்தி