ముధోల్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(బాలికల)లో మంగళవారం నిర్వహించిన ఎన్ఏఎస్ అభ్యసన పరీక్షను ఏంఈఓ మైసాజి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జాతీయస్థాయిలో నిర్వహించే ఎన్ఏఎస్ (నేషనల్ అచీవ్మెంట్ సర్వే)ఈ సం. నవంబర్ 24న నిర్వహించనున్నారని పేర్కొన్నారు. దీనిని 3, 6, 9వ తరగతులకు నిర్వహిస్తారన్నారు. పరీక్ష ముఖ్య ఉద్దేశం పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాలను అంచనా వేస్తారని తెలిపారు.