బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు: సిఐ

61பார்த்தது
బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు: సిఐ
భైంసా పట్టణంలోని బెల్టు షాపులో దాడులు నిర్వహించి మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేశారు. పట్టణ సిఐ రాజా రెడ్డి తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని పిప్రి కాలనీలో బెల్టు షాపులో తనిఖీ చేయగా 5, 520 రూపాయల విలువగల 4. 6 లీటర్ల అక్రమ మద్యం స్వాదినం చేసుకున్నట్లు తెలిపారు. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తనిఖీల్లో ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி