ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: ఎంపీపీ

83பார்த்தது
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి: ఎంపీపీ
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరిదని బైంసా ఎంపీపీ రాజాక్ అన్నారు. సోమవారం మిర్జాపూర్ సమీపంలో పోలీస్ బెటాలియన్ క్యాంప్ ఆఫీస్ వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఇంటి ముందు, పంట పొలాల్లో మొక్కలు నాటి భావితరాల కోసం పాటుపడాలన్నారు. వృక్ష సంపదను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సీఎల్పీఓ మొజాం, ఎంపీడీఓ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி