శ్రీ విఠలేశ్వర, రుక్మాబాయి ఆలయంలో ఏకాదశి వేడుకలు

71பார்த்தது
కుంటాల మండలం ఓలా శ్రీ విఠలేశ్వర, రుక్మాబాయి ఆలయంలో బుధవారం ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పంచామృతం మహాభిషేకం, అష్టోత్తరశత, తులసి పుష్పార్చన, సామూహిక విష్ణు సహస్ర పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించారు. పూజారులు తొలి ఏకాదశి విశిష్టతను భక్తులకు వినిపించారు. గురువారం ఉదయం 7గంటలకు కాగడ హారతి అంతరం అన్నదానం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி