చిట్యాల మండలం ఎలికట్టే గ్రామం సుందరయ్య కాలనీలోని ట్యాంక్ నుంచి గత కొద్దిరోజులుగా నీరు వృధాగా పోతుంది. దీని ద్వారా ట్యాంక్ సమీపంలో నివసిస్తున్న ఇంట్లోకి నీరు చేరుతున్నాయి. అంతేకాకుండా ట్యాంక్ కూడా శిథిలావస్థకు చేరింది. అధికారులకు పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని శనివారం కోరుతున్నారు.