చిలుకూరులో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి

66பார்த்தது
చిలుకూరులో పిడుగు పడి రెండు పాడి గేదెలు మృతి
చిలుకూరు మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. కాగా గ్రామానికి చెందిన కొండ ఎల్లయ్య ఇంటి ముందు చెట్టు కింద కట్టేసిన రెండు పాడి గేదెలు పిడుగు పడి మృతి చెందాయి. గేదెల విలువ సుమారు రూ. 1, 60, 000 ఉంటుందని గేదెల యజమాని వాపోయాడు. పాడి గేదెలు మృతి చెందడంతో తమ కుటుంబం ఉపాధి కోల్పోయిందని ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

தொடர்புடைய செய்தி