మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ గా నరేందర్

66பார்த்தது
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ గా నరేందర్
మెదక్ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ గా టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ ఎన్నికయ్యారు. శనివారం స్థానిక టీఎన్జీవో భవన్ లో ఉద్యోగులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు విశ్రాంత ఉద్యోగులు కలిసి ఐక్య కార్యాచరణ సమితి సమావేశంలో నరేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా టిఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி