ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థినులకు అభినందనలు

932பார்த்தது
ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థినులకు అభినందనలు
2021 - 22 విద్యా సంవత్సరంలో పదవ తరగతి వార్షిక ఫలితాల్లో ఉత్తమ గ్రేడు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సబేపల్లి విద్యార్థినులు చిందం శృతి మరియు జుమ్మిడి ప్రవీణలు బాసర ఐఐటీలో సీట్లు సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినులను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన బాసర ఐఐటీలో పాఠశాల విద్యార్థినులు సీట్లు పొందడం గర్వకారణంగా ఉందని అన్నారు. పిల్లలు ఉత్తమ స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி