20 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

70பார்த்தது
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదిల్ పెట్ గ్రామ శివారులో గల నీలం బ్రదర్స్ రైస్‌మిల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. రైస్ మిల్లు యాజమానులు చుట్టుపక్కల గ్రామాల నుంచి రాత్రిపూట రహస్యంగా ప్రభుత్వ చౌక ధరల బియ్యం కొనుగోలు చేస్తున్నారని అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలిసి రైస్ మిల్లుపై దాడి చేసి 20 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி