ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. భీమిని మండలంలోని ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలన్నారు. సమయానికి పాఠశాలకు హాజరుకాని ఉపాధ్యాయులు విజయ, స్వాతి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజు నోటీసులు జారీ చేశారు.