వైభవంగా.. శ్రీనివాసుడి కళ్యాణం..!

68பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలోని విశ్వక్సేన గోశాలలో గోశాల జేష్ఠమాస పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు సౌమిత్రి రామాచార్యులు ఆధ్వర్యంలో భూదేవి, నీలాదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కళ్యాణము వైభవంగా నిర్వహించారు. ఉదయం అర్చకులు స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం కన్నులపండుగగా జరిపి స్వామి, అమ్మవార్లకు భక్తుల చేత అక్షింతలు పోయించారు. ఈ కార్యక్రమానికి భక్తులు తరలివచ్చి కళ్యాణం తిలకించారు

தொடர்புடைய செய்தி