అహోబిలంలో ఎంపి డీకే అరుణ ప్రత్యేక పూజలు

81பார்த்தது
మహబూబ్ నగర్ ఎంపి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని అహోబిలం లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా దిగువ అహోబిలంలో నృసింహస్వామి, అమృతవల్లి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఎంపి అరుణకు అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు, దైవ ఆశీర్వచనాలు ఎంపి అరుణకు ఆలయ అర్చకులు అందజేశారు.

தொடர்புடைய செய்தி