మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో మిషన్ భగీరథ పైపు లైన్లు మార్పు చేస్తున్నందున నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గురువారం నుంచి శనివారం ఉదయం 8: 00 గంటల వరకు ఏనుగొండ, శ్రీనివాస్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, పద్మావతి కాలనీ, అప్పన్నపల్లి, తిమ్మసానిపల్లి, టీచర్స్ కాలనీ, రాజేంద్రనగర్, షాషాబ్ గుట్ట, ఏదిర, పాలకొండ, బాయమ్మతోట తదితర ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని అన్నారు.