రాజకీయ కుట్రలతో ముదిరాజులకు నష్టం: మెట్టుకాడి శ్రీనివాస్

82பார்த்தது
రాజకీయ కుట్రల కారణంగా ముదిరాజులు నష్టపోతున్నారని మంగళవారం ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయని చెరువులను పునరుద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ముదిరాజులు జీవనోపాధి లేక వలసలు పోతున్నారని వారికి ప్రభుత్వం ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி