ఎమ్మెల్యే జియంఆర్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి

83பார்த்தது
ఎమ్మెల్యే జియంఆర్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందారు. దీంతో గురువారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని చిన్న చింతకుంట మండలం, దమగ్నాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తండ్రి కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి, శ్రీరామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி