ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా శనివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. GT ఇచ్చిన 181 పరుగుల లక్ష్యాన్ని లక్నో జట్టు 4 వికెట్లు కోల్పోయి 19.3 ఓవర్లలో ఛేదించింది. LSG బ్యాటర్లలో మార్క్రమ్ (52), నికోలస్ పూరన్ (61) అర్థశతకాలతో రాణించారు. GT బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.