ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం భారత్- పాకిస్థాన్ మధ్య సమరం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ వీక్షించేందుకు మంత్రి నారా లోకేశ్ కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఐసీసీ ఛైర్మన్ జైషాతో లోకేశ్ భేటీ అయ్యారు. APలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జైషాతో చర్చించినట్టు లోకేశ్ వెల్లడించారు.