ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు

66பார்த்தது
ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు
ఏపీలో శుక్రవారం రాత్రి ఏడు గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తులకు గడువు ముగిసింది. ఇప్పటి వరకు మద్యం దుకాణాలకు 85 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా రూ.1700 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. ఈ నెల 15న లాటరీ తగిలిన ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగించనున్నారు. ఈ నెల16 నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.

தொடர்புடைய செய்தி