ములకలపల్లి మండలం పాతూరులో అధికారులు వెంటనే పారిశుద్ధ్య పనులను ప్రారంభించాలని మండల సిపిఐ నేత నరాటి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం పాతూరు గ్రామంలో సిపిఐ నేతలు పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ఇప్పటివరకు అధికారులు పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యాలంటే అధికారులకు లెక్క లేదా అని ప్రశ్నించారు.