చెరువులో చేపలు పట్టేందుకు దిగి మృత్యువాత

80பார்த்தது
చెరువులో చేపలు పట్టేందుకు దిగి మృత్యువాత
దమ్మపేట గొల్లగూడేనికి చెందిన మారుతి బాబూరావు(50) గ్రామ సమీపంలోని చింతల చెరువులో చేపలు పట్టేందుకు దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి సోమవారం మృతిచెందారు. చెరువులోని బురదలో కూరుకుపోయి మృతిచెంది ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో బాబూరావు మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి పంచనామా నిర్వహించారు. ఎస్ఐ సాయికిశోర్రెడ్డి కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி