అంకుశాపూర్ రైతులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భరోసా

64பார்த்தது
కాగజ్‌నగర్‌ మండలం కోసినిలోని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాసంలో ఆయన్ను అంకుశాపూర్ పోడు రైతులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వారి బాధను విన్నవించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో తమను అటవీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. స్పందించిన ప్రవీణ్ కుమార్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి, నేనున్నానంటూ భరోసా కల్పించారు.

தொடர்புடைய செய்தி