లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి ఓటమి ఖాయమని, దీనికి మల్లికార్జున ఖర్గేను బలిపశువును చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్జేడీ పాలనలో బిహార్లో అపహరణలు, హత్యలు సర్వసాధారణమని విమర్శించారు. ఎస్సీలు, వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను కాజేసేందుకు 'ఇండియా' కూటమి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటానని మోదీ తెలిపారు.