నూతన గృహాలు, సైడ్ డ్రైనేజీలు నిర్మించాలి

57பார்த்தது
నూతన గృహాలు, సైడ్ డ్రైనేజీలు నిర్మించాలి
వేంసూరు మండలం కుంచపర్తి గ్రామంలోని దళితవాడలో సీపీఎం నాయకులు మల్లూరు చంద్రశేఖర్ పర్యటించి ప్రజా సమస్యలపై సర్వే చేసి సంతకాల సేకరణ చేశారు. నూతన గృహాలు లేక శిథిలమైన ఇండ్లలో నివసిస్తున్న దుస్థితి ఉందని, సైడ్ డ్రైనేజీలు లేక వరద నీరు చేరి ఇండ్లలో ఉండలేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి నూతన గృహాలు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించాలని కోరారు. ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు.

தொடர்புடைய செய்தி