కూసుమంచి మండలం జూజ్జులరావుపేట, మల్లాయిగూడెం ప్రాంతాల్లోని ఎండిపోయిన పంట పొలాలను మంగళవారం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పరిశీలించారు. సాగర్ నీరు అందక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆయకట్టు రైతుల సౌకర్యార్థం ఇప్పటికే సాగర్ జలాలను విడుదల చేశామన్నారు. రైతులు సాగర్ జలాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.