మధిర మండల ప్రజలకు టౌన్ పోలీస్ శాఖ విజ్ఞప్తి

54பார்த்தது
మధిర మండల ప్రజలకు టౌన్ పోలీస్ శాఖ విజ్ఞప్తి
వినాయక నిమజ్జనాలను మధిర ట్యాంక్ బండ్ ప్రాంతంలోనే జరపాలని మధిర టౌన్ పోలీసులు సూచించారు. చెరువు ప్రాంతంలో క్రేను, బోటు సహాయంతో నిమజ్జన కార్యక్రమలను సిబ్బంది, అధికారుల పర్యవేక్షణలో జరపనున్నట్లు తెలిపారు. మధిర టౌన్ పరిధిలోని వినాయక మండపాల నిర్వాహకులు, మండల ప్రజలు సహకరించి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని పోలీసులు సూచించారు. నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదన్నారు.

தொடர்புடைய செய்தி