మహిళల భద్రతే షీటీమ్ లక్ష్యం

80பார்த்தது
మహిళల భద్రతే షీటీమ్ లక్ష్యం
మహిళల భద్రతే షీటీమ్ లక్ష్యమని షీటీం ఇన్‌చార్జి, ఏఎస్ఐ మల్లన్న అన్నారు. మంగళవారం పెద్దపల్లి పట్టణం రంగంపల్లి మైనారిటీ జూనియర్ కళాశాలలో మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే విద్యార్థినిలు, మహిళలు నిర్భయంగా 6303923700 నెంబరుకు ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షీటీం సిబ్బంది స్నేహాలత, సురేష్, భరోసా టీం సభ్యులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி