భిక్కనూరు మండలంలో గల అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని మండల అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్ చెప్పారు. మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, జూన్ నెలాఖరు వరకు పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ కార్యదర్శి లక్ష్మీ, ఉపాధి హామీ పథకం ఏపీఓ రాధిక, గ్రామస్తులు ఉన్నారు.