భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రొటోటైప్ వర్షన్ను ఆదివారం బెంగళూరులోని BEML ప్లాంట్లో ఆవిష్కరించారు. రైలులో రైలు సహాయకుల కోసం ప్రత్యేక బెర్త్లు, రాత్రి సమయంలో వాష్రూమ్కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఫ్లోర్ LED స్ట్రిప్పులు ఉన్నాయి. ఈ రైలు గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనుంది. టెస్టింగ్ సమయంలో ఇది గంటకు 180 కి.మీ.గా ఉంది.