కాంగ్రెస్ ప్రజలకు మంచి చేసిందని గుర్తిస్తేనే తమకు ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ పదేళ్లు పాలించాయని ఏనాడు నిరుద్యోగులు, ప్రజల గురించి పట్టించుకోలేదని మండిపడ్డారు.
తాము అభివృద్ధి చేసింది నిజమైతే నరేందర్ రెడ్డికే ఓటేయాలని కోరారు.