అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ షాక్ తో ఆవు మృతి

56பார்த்தது
అధికారుల నిర్లక్ష్యం.. విద్యుత్ షాక్ తో ఆవు మృతి
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఆవు మృతి చెందిందని బాధిత రైతు వాపోయాడు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఉడిమేశ్వరం కుమ్మరి చంద్రశేఖర్ కు చెందిన ఆవు రోజు మాదిరిగా పాఠశాల సమీపంలో మేత మేస్తోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కంచె లేని ట్రాన్స్ ఫార్మర్ కు తగిలి అక్కడిక్కడే మృతి చెందిందని తెలిపాడు. మృతి చెందిన ఆవు విలువ సుమారుగా రూ. 70 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

தொடர்புடைய செய்தி