గుండెల నిండా గులాబీ పార్టీ... నివేదితమ్మకు అండగా జనం

73பார்த்தது
గుండెల నిండా గులాబీ పార్టీ... నివేదితమ్మకు అండగా జనం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం 150 వ డివిజన్లో బీఆర్ఎస్ ప్రచారం ధూంధాంగా సాగింది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న అంబేద్కర్ నగర్లో ఇంటింటికి తిరిగి క్యాంపెయిన్ చేశారు. మాజీ కార్పొరేటర్ ఆకుల రూప హరితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. సంక్షేమ పథకాల బీఆర్ఎస్ కే మద్దతు పలకాలని నివేదిత కోరారు. కాంగ్రెస్ పాలనలో నిరుపేదలను పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో హడావుడి చేయడం తప్ప వాటి అమలుపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీలతో ఇలాంటి లాభం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం రాజీ లేకుండా పోరాటం చేసే సత్తా గులాబీ పార్టీకే ఉందని తేల్చిచెప్పారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజల ముందున్నాయన్నారు. అభివృద్ధి తమ నినాదం అని కాబట్టి ఈసారి ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని నివేదిత అందరికీ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రచారానికి జనమంతా జేజేలు పలికారు. శాలువాలు, పూలమాలలతో నివేదితను సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. గులాబీ పార్టీ వెన్నంటి ఉంటామని, నివేదితను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ పునారు. ఈ ప్రచారంలో స్థానిక బీఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల హరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తో పాటు సీనియర్ నాయకులు నరసింహ ముదిరాజ్, దాసరి కర్ణ కుమార్, సృజన్, వినయ్, నారాయణ, రాము, జోడి బ్రదర్స్, మహిళా నాయకులు అనిత, సువర్ణ, మాధురి, భవాని తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி