ఆల్ పాస్టర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి

78பார்த்தது
ఆల్ పాస్టర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా రాగిడి లక్ష్మారెడ్డి
మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని మల్కాజ్ గిరి నియోజకవర్గం, అల్వాల్ సర్కిల్, సైనిక్ పురి, కినరా గ్రాండ్ లో మంగళవారం జరిగిన ఆల్ పాస్టర్స్ మీటింగ్ లో ముఖ్య అతిథిగా మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మరియు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని మర్యాదపూర్వకంగా శాలువాతో సన్మానించి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందాలని ప్రార్థనలు చేశారు. తదనంతరం బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ క్రిస్టియన్లు సేవా దృక్పథంతో పాటు జాలి, కరుణ కలిగి ఉంటారని అన్నారు. ప్రతి మనిషి ఎదుటివారిని ప్రేమించగలగటమే గొప్ప లక్షణం అని, అలా ప్రేమించలేని వారు మనుషులే కాదు అని, తప్పు చేయాలని ఏ మతం బోధించదు అన్నారు. శాంతి సహనంతో జీవించాలనే మతాలన్నీ చాటి చెప్పాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషుల ఏడుపు, బాధ, సంతోషం ఒకేలా ఉంటాయి. దేశ జీడీపీలో అందరి భాగస్వామ్యం ఉంటుంది. అందులో ఎలాంటి రంగులు, తేడాలు ఉండవు. సమాజంలోని ప్రతి ఒక్కరూ శాంతిమార్గంలో నడవాలని, ప్రతి మతం ఇదే విషయాన్ని చాటి చెప్పిందని అన్నారు. మన ప్రాంత అభివృద్ధి, సంక్షేమం పట్టని మత తత్వ పార్టీలను నమ్మొద్దు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాస్టర్స్ సల్మాన్, ఆనంద్, లేనార్డ్, దినకరన్, ఆరన్, ఆశీర్వాదం మరియు ఆల్ మల్కాజ్ గిరి పాస్టర్స్, స్థానిక కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు అనిల్, కిషోర్, ఢిల్లీ పరమేష్, లక్ష్మన్ ,నరేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, జగదీష్ గౌడ్, మురుగేష్, పరుశురాం రెడ్డి, అమీన్ ఉద్దీన్, చిన్నా యాదవ్, రాము, వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி