సచివాలయం వద్ద నల్ల బ్యాడ్జీలతో విలేకరుల నిరసన

68பார்த்தது
రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడులు చేయడం దారుణమని పలువురు విలేకరులు మండిపడ్డారు. బుధవారం ఓయూలోని డిఎస్సీ రద్దు చేయాలని విద్యార్థులు చేస్తున్న కార్యక్రమాన్ని కవరేజ్ చేయడం కోసం వెళ్లిన విలేకరి, కెమెరామెన్ల పట్ల ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓయూ పోలీసుల తీరును ఖండిస్తూ సచివాలయంలోని మీడియా సెంటర్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி