ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో హార్దిక్ పాండ్యా అద్భుత ఫామ్లో కనిపించాడు. రెండు వికెట్లు తీసి సత్తా చాటాడు. అలాగే 200 అంతర్జాతీయ వికెట్లు తీసుకున్న బౌలర్గా హార్దిక్ నిలిచాడు. మొత్తంగా హార్దిక్ పాండ్యా అంతర్జాతీయ క్రికెట్లో 200 వికెట్లు సాధించగా.. అందులో టీ-20ల్లో 94 వికెట్లు, వన్డేల్లో 89 వికెట్లు, టెస్టు మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు.