వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు

72பார்த்தது
వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని పలు కూడళ్లలో వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్స్యూరెన్స్, ఫిట్నెస్, ఆర్సి వంటి పత్రాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி