180 మంది పోలీసులతో బందోబస్తు

50பார்த்தது
180 మంది పోలీసులతో బందోబస్తు
ఉట్కూర్ మండల కేంద్రంలో జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్రకు 180 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ లింగయ్య తెలిపారు. ఆదివారం పోలీస్ స్టేషన్ ఆవరణలో బందోబస్తు విధులకు వచ్చిన పోలీసులతో సమావేశం నిర్వహించారు. నిమజ్జనం పూర్తి అయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని, తమకు కేటాయించిన స్థానాలలో పకడ్బందీగా విధులు నిర్వహించాలని చెప్పారు. శోభాయాత్ర శాంతియుతంగా జరిగేలా చూడాలని సూచించారు.

தொடர்புடைய செய்தி