కుటుంబ కలహాలు.. భర్తను కత్తెరతో పొడిచి చంపిన భార్య (వీడియో)

1057பார்த்தது
కుటుంబ కలహాలతో భర్తను భార్య కత్తెరతో పొడిచి చంపింది. ఈ ఘటన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఉండ్రాజవరం మండలం రెడ్డిచెరువు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, ఆయన భార్య రాణి.. తరచూ గొడవలు పడుతుంటారు. అయితే మంగళవారం రాత్రి కూడా గొడవ జరిగింది. ఈ సమయంలో రాణి తన భర్త గుండెలపై కత్తెరతో పొడిచింది. అతన్ని కుటుంబీకులు తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా .. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி