గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం

2642பார்த்தது
గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం
TG: గల్ఫ్‌ మృతుల కుటుంబాలకు పరిహారంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. బహ్రెయిన్‌, కువైట్‌, ఇరాక్‌, ఒమన్‌, ఖతర్‌, సౌదీ అరేబియా, యూఏఈలో మరణించిన కార్మికుల కుటుంబాలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. మరణించిన గల్ఫ్‌ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. మరణించిన 6 నెలల్లోపు కుటుంబసభ్యులు కలెక్టర్‌కు దరఖాస్తు చేస్తే ఈ పరిహారం అందుతుంది.

தொடர்புடைய செய்தி