ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలుకు వెళ్లి, లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కోర్టులో పిటిషన్ వేసింది. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియనున్న జూన్ రెండో తేదీలోపే ఆయన జ్యుడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించాలని పిటిషన్లో కోరింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ తన పిటిషన్ను దాఖలు చేసింది.