భారత రాజ్యాంగ రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పార్లమెంట్లో ఆవరణలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. కాగా ఇవాళ అంబేద్కర్ జయంతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు.