తీన్మార్ మల్లన్నపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అర్హుడని ఈసీ తెలిపిందని.. కేటీఆర్ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. వెంటనే కేటీఆర్ తన మాటలు విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి అతిథిగా సోనియా గాంధీ వస్తున్నారని.. ఆమెను ఘనంగా సన్మానిస్తున్నామని చెప్పారు.