టన్నెల్ ప్రమాదంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్న వారిని కాపాడేందుకు చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని.. సహాయక చర్యల్లో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం తెలిపారు.