ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటై
పదేళ్లు పూర్తి అయినప్పటికీ ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. సమస్యల పరిష్కారానికి గతేడాది జులైలో ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. ఈ క్రమంలో మరోసారి భేటీ అయి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.