దుర్గాపూజ వద్దకు చెప్పులతో వచ్చారు.. కాజోల్ తీవ్ర ఆగ్రహం!

62பார்த்தது
దుర్గాపూజ వద్దకు చెప్పులతో వచ్చారు.. కాజోల్ తీవ్ర ఆగ్రహం!
ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీలు దుర్గాపూజ ఘనంగా జరుపుకొంటున్నారు. కాజోల్, అలియా భట్, రాణీ ముఖర్జీ, అజయ్ దేవగణ్ వంటి వారంతా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాజోల్ ఎవరిపైనో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. కొంతమంది భక్తులు, ఫొటోగ్రాఫర్లు చెప్పులతోనే మందిరంలోకి వచ్చేయడంతో వారిపై కాజోల్ మండిపడ్డారు. 'ఇది పూజా ప్రదేశం. కొంచెం గౌరవంతో వ్యవహరించండి' అంటూ క్లాస్ తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி