TG: తెలంగాణలో 'ధరణి' పోర్టల్కు బదులుగా ఏప్రిల్ 14 వ తేదీ నుంచి 'భూభారతి' ప్లాట్ ఫాం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ భారతి అమలుకు సంబంధించి అధికారులతో సుదీర్ఘంగా చర్చించడంతో పాటు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ పోర్టల్ ద్వారా భూమి రికార్డులు, రైతు బంధు అర్హతలు, భూమి ప్రయోజన స్థితిగతులు అన్ని ఒక్క క్లిక్తో లభించనున్నాయి.