దైవత్వాన్ని నమ్ముకుంటే పని ఒత్తిడిని జయించవచ్చు: నిర్మలా సీతారామన్‌

58பார்த்தது
దైవత్వాన్ని నమ్ముకుంటే పని ఒత్తిడిని జయించవచ్చు: నిర్మలా సీతారామన్‌
విద్యా సంస్థలు దైవత్వాన్ని, ఆధ్యాత్మికతను బోధిస్తే పిల్లలు మనోబలంతో వృద్ధిలోకి రాగలరని తాను విశ్వసిస్తానని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. ‘‘దైవత్వాన్ని నమ్ముకుంటే పని ఒత్తిడిని జయించొచ్చు. దేవుడి మీద నమ్మకం ఉంచితే.. దేవుడి అనుగ్రహం ఉంటే.. సహజంగానే క్రమశిక్షణ అలవరుతుంది. అప్పుడే ఆత్మశక్తి పెరుగుతుంది. తద్వారా మనోబలం సమకూరుతుంది’’ అని నిర్మలా సీతారామన్‌ అన్నారు.

தொடர்புடைய செய்தி