విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కిన కౌటాల రైతులు

68பார்த்தது
విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కౌటాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. 24 గంటల విద్యుత్ అందించాలని.. విద్యుత్ శాఖ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నామని, 24గంటల కరెంటు అందించాలని కోరారు. వెంటనే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచాయి.

தொடர்புடைய செய்தி